politics

నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ రామ

_గీతమ్ లో ఘనంగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కోటి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని, జీవన నాణ్యతను (శారీరక, సామాజిక, మానసిక) ప్రభావితం చేస్తుందని ప్రముఖ దంత వెద్యుడు డాక్టర్ రాము నోముల అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో సోమవారం నిర్వహించిన ప్రపంచ నోటి ఆరోగ్యం దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని రుద్రారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓరల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపుతో పాటు గీతం ఫార్మసీ విద్యార్థులతో ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించారు,నోటి నుంచి వచ్చే ట్యాక్టీరియా నేరుగా లాలాజలం, రక్తం ద్వారా గుండెలోకి ప్రవేశిస్తుందని, దీనివల్ల గుండెల్లో మంట వస్తుందని, దీనిని బాక్టీరియల్ ఎండోకార్డిటిస్ అంటారని డాక్టర్ రాము పేర్కొన్నారు. నోటి పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని వర్ధమాన ఫార్మసిస్ట్లకు ఆయన ఉద్బోధించారు.

మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నోరు కూడా ఒక సాధనమని, చక్కగా మాట్లాడడం, హాయిగా.. నవ్వడం, రుచి చూడటం, సరైన పోషకాహారాన్ని జీర్ణించుకోవడంపై నోటి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని డాక్టర్ రాము వివరించారు. జిగ్ జాగ్గా ఉండే బ్రను పళ్లు తోమడానికి ఎంపిక చేసుకోవాలని, మూడు నుంచి ఐదు నిముషాల లోపు. పర్ణను తోనుడం ముగించాలని, త్వరత్వరగా బ్రష్ చేయకూడదని ఆయన సూచించారు. డీ-మినరలెజేషన్ ఇన్ఫెక్షన్కు : దారితీస్తుందని, దాని ఫలితంగా చిగుళ్లకు కావిటీ (గుల్ల ఏర్పడడం), తద్వారా చికాకులు ఏర్పడతాయన్నారు. ఇది రక్తస్రావం, పళ్లూడడానికి దారితీస్తుందని చెప్పారు. అధిక మద్యసేవనం, మాదకద్రవ్యాల వినియోగం, ధూమపానం దంతక్షయాన్ని పెంచుతుందని, ఇది కొన్నిరకాల నోటి క్యాన్సర్కు దారితీయడమే గాక వళ్లు ఊడిపోవడానికి కూడా దారితీస్తుందన్నారు. వాటిని మానుకోవడంతో పాటు చక్కెర పదార్థాలను పరిమితంగా భుజించాలని డాక్టర్ రాము సూచించారు.

రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని, పడుకునే ముందు లేదా భోజనం తరువాత నీరు పుక్కిలించి ఉమ్మాలని, ఆరో నీటితో కాకుండా కుళాయి ద్వారా వచ్చే మునిసిపల్ నీటితో దంతావధానం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన భోజనం చేయాలని, తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగడంతో పాటు ఏడాదికి ఒక్కసారైనా వెద్యులచే దంత పరీక్షలు చేయించుకోవడం ద్వారా దంతక్షయాన్ని నివారించవచ్చని డాక్టర్ రాము నోముల వివరించారు.కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ టి. సుధాలన మాట్లాడుతూ, ధూమపానం, పొగాకు నమలడం అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, అందువల్ల వాటికి దూరంగా ఉండడమే మేలని హితవు పలికారు.తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.తినకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సీహెన్, పవన్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దాదాపు 200 మంది చుద్రారం పాఠశాల విద్యార్థులకు చంత పరీక్షలు నిర్వహించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago