మనవార్తలు, పటాన్ చెరు :
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో అందజేసారు.
అనంతరం దేవేందర్ రాజు మాట్లాడుతూ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామిహైదరాబాద్ కు తోలి డిప్యుటి మేయర్గా 1955లో ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీలకు సహాదారుగా పని చేశాడు. 1957లో మేయర్గాఎన్నికైనారు. కృష్ణస్వామి స్వాతంత్య్రానంతర హైద్రాబాద్కు మొదటి మేయర్ గా పని చేశారు. 1957లో హైదరాబాద్ నాలుగో మేయర్గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.
అని సంపాదన పై ఆశ లేక, ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ప్రజా జీవితంలో మచ్చలేని జీవితం గడిపాడు అని మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ గూడా ఉపసర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేష్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, వేణుగోపాల్ ముదిరాజ్, జిన్నారం మండల మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భవాని రమేష్, ముదిరాజ్, మోత కృష్ణ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…