_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ
మనవార్తలు ,నంద్యాల:
నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయపడిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు ,సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ .రంగనాయుడులు డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని త్వరగా పనులు పూర్తి చేయాలని కార్మికులపై ఎక్కువ పని భారంమోపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు . ప్రమాదం జరగడానికి కారకులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .
మరణించిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు, ప్రమాదంలో గాయపడిన ప్రతి కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నంద్యాల జిల్లాలో ని సిమెంట్ ఫ్యాక్టరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో కూడా గడివేముల ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటన జరిగిన ఫ్యాక్టరీ యజమాన్యం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని గుర్తు చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .
గతంలో పాలిమర్స్ కంపెనీలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ఇచ్చారని వారు గుర్తు చేశారు . మృతి చెందిన ప్రతి కార్మికుల కుటుంబానికి ఇచ్చి ఆదుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…