politics

రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలి – సీపీఐ

_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ

మనవార్తలు ,నంద్యాల:

నంద్యాల జిల్లా బన‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయ‌ప‌డిన వారికి 25 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు కె.రామాంజ‌నేయులు ,సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ఎన్ .రంగ‌నాయుడులు డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ‌స్తున్నార‌ని త్వరగా పనులు పూర్తి చేయాలని కార్మికులపై ఎక్కువ పని భారంమోప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌న్నారు . ప్రమాదం జరగడానికి కారకులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .

మరణించిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు, ప్రమాదంలో గాయపడిన ప్రతి కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నంద్యాల జిల్లాలో ని సిమెంట్ ఫ్యాక్టరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో కూడా గడివేముల ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటన జరిగిన ఫ్యాక్టరీ యజమాన్యం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేద‌ని గుర్తు చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కార్మికుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు .

గతంలో పాలిమర్స్ కంపెనీలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ఇచ్చారని వారు గుర్తు చేశారు . మృతి చెందిన ప్రతి కార్మికుల కుటుంబానికి ఇచ్చి ఆదుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ‌ని హెచ్చ‌రించారు. బాధిత‌ కుటుంబాలకు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago