Telangana

అక్టోబర్ 21 నుంచి 24 వరకు గీతంలో సైబర్ సెక్యూరిటీ వారోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 24 వరకు ‘సైబర్ సెక్యూ రిటీ వారోత్సవం-2024’ను బెంగళూరులోని వేమన ఇన్-స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో నిర్వహించనున్నారు. బెంగళూరులోని సైబర్ సెక్యూరిటీ ఎస్టీసీ, ఐ ట్రిపుల్ ఈ కంప్యూటర్ సొసైటీల సౌజన్యంతో, వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ రంగంలో విద్యార్థుల జ్జానం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా నిర్దేశించు కున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ నిరంజన్ అప్పస్వామి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.అక్టోబర్ 21న ప్రారంభోత్స వేడుకతో ఆరంభమవుతుందని, ఆ తరువాత హైదరాబాద్-లోని హిటాచీ ఇండియాకు చెందిన విశాల్ కల్లా ‘సైబర్ భద్రతా చర్యలు: డిజిటల్ యుగం కోసం పరిశ్రమ అంతర్దృష్టులు, పరిష్కారాలు’ అనే అంశంపై స్ఫూర్తిదాయక కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. అదే సమయంలో, గురురాజ్ దేశ్-పాండే వేమన ఇన్-స్టిట్యూట్లో ‘చిన్న బగ్-ల నుంచి ప్రధాన ఉల్లంఘనల వరకు: సైబర్ దాడి కథనాలు’ అనే అంశంపై ప్రసంగించి, వాస్తవ ప్రపంచ సైబర్ సెక్యూరిటీ సవాళ్లపై లోతైన అవగాహనను కల్పిస్తారన్నారు. అదే రోజు మధ్యాహ్నం ‘బిగ్ సైబర్ ఇన్ఫర్మేటిక్స్’పై ఫోరెన్సిక్ కార్యశాలను ప్రొఫెసర్ ఎస్.దిలీప్ నిర్వహిస్తారని డాక్టర్ నిరంజన్ తెలియజేశారు.అక్టోబర్ 22న, ‘సెక్యూర్ ఐడియాథాన్’ పేరిట పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు పురస్కారాలను అందజేస్తారని, దీనికి ఎటువంటి రుసుము లేదని, అయితే పేర్ల నమోదు తప్పనిసరని అన్నారు. ఇక ఈ వారోత్సవాలకే తలమానికం లాంటి ‘సెక్యూర్ హాక్’ పేరిట 24 గంటల హ్యాకథాన్ అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, మరునాడు రాత్రి 12 గంటలకు ముగుస్తుందని తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలుంటాయని, ఐ ట్రిపుల్ ఈ జట్లకు నామమాత్రపు (రూ.70) రుసుము, ఇతరులు రూ.100 చెల్లించి తమ జట్ల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.సైబర్ భద్రత యొక్క సంక్లిష్టతలపై అవగాహన ఏర్పరచడానికి, తరువాతి తరం సైబర్ సెక్యూరిటీ నిపుణులను ప్రేరేపించడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ నిరంజన్ వివరించారు. ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం https://linktr.ee/homepage.cyberweek లింక్-ను సందర్శించాలని, లేదా 81230 33210ను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago