తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యమని, కేసీఆర్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ప్రచార కమిటి అధ్యక్షులు కొత్త బస్వరాజ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకపోగా, రోజు రోజుకు కొత్త హమీలిస్తు ప్రజలను అమాయకులను చేసి మానసిక స్థితులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమయ్యాయి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంలో జ్యప్యం ఎందుకు అని ప్రశ్నించారు.
రైతు రుణ మాఫీ చెయ్యకపోవడంలో అర్థం ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న సమస్యలు రోజంతా చెప్పిన మిగులుతాయని పేర్కొన్నారు. ఇన్ని సమస్యల వల్ల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండక ఎలా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ భూములను బేరం పెట్టడం అంటే ఆ రాష్ట్రం త్వరలో దివాలా తీస్తుందని, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తేనే ఈ ప్రభుత్వం పని తీరు ఏమిటో అర్థం అవుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన విధంగా పరిపాలన జరపాలని అన్నారు. లేదంటే అతి త్వరలో గద్దె దిగే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…