Telangana

గీతమ్ లో ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో గురువారం ‘జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, హెదరాబాద్ లోని భారత గణాంక సంస్థకు చెందిన డాక్టర్ జీఎస్ఆర్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటింగ్ స్టాక్ ‘సమస్య’ను ఆయన విశదీకరించారు. ఇది అనేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులను అత్యంత ఆకర్షణీయమైన, కీలకమైన పాఠ్యాంశం వైపు ఆకర్షించడానికి ఉద్దేశించిన ‘సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గణితశాస్త్ర ప్రోగ్రామింగ్’ గురించి డాక్టర్ మూర్తి వివరించారు.

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రాజా, సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు పాల్గొన్నారు. గీతం గణాంక ఆచార్యులు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కె. అనిల్కుమార్, శివ, అతిథిలతో కూడిన విద్యార్థి బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మహలనోబిస్ గురించి:

భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ స్వేచ్ఛా భారతదేశం మొదటి ప్రణాళికా సంఘంలో పనిచేశారు. ఒక పెద్ద నమూనా సర్వేను రూపొందించడంలో, మహాలనోబిస్ దూరాన్ని గుర్తించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ని స్థాపించి ఆంత్రోపోమెట్రీ రంగానికి తనవంతు సహకారం అందించారు. గణాంక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు, బహుమతులను _అందుకున్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

11 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

11 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

11 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

11 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago