Hyderabad

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ను కలిసి వివరించిన నడిగడ్డతాండా వాసులు

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

ఢిల్లీలో జరిగిన నడిగడ్డ తాండ సీఆర్పీఎఫ్ సమస్యపై జాతీయ వెనుకబడిన వర్గాల బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఢిల్లీలో సీఆర్పీఎఫ్ హైకమాండ్ ఐజీ మరియు డీఐజీ మరియు కస్టోడియం ల్యాండ్ ఆఫీసర్లు మరియు రెవిన్యూ అధికారులు కమిషన్ ముందు హాజరు అయ్యారు. ఆచారి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి మెట్రోరైలు ప్రాజెక్టు హుడా వారు అక్కడ భూకబ్జాలు చేసి భవనాలు కట్టుకున్న ముందునుంచే బంజారాలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు నివాసం ఉంటున్నారు. ఆ పేద ప్రజలపై దయవుంచి నడిగడ్డ తండా సుభాష్ చంద్రబోస్ ల ను మినహాయించి మిగతా భూమిని సీఆర్పీఎఫ్ వాళ్ళకు సర్వే చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అలాగే సీఆర్పీఎఫ్ అధికారులకు కూడా తాండా సుభాష్ చంద్రబోస్ నగర్ లను వదిలి ఖాళీ స్థలాన్ని తీసుకోవాలని కోరడం జరిగింది. వారు కూడా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించారు. కానీ రెండు బస్తీలు మినహాయించి ఖాళీ స్థలాన్ని సర్వే చేసి వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది .అలాగే కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి ని కూడా కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో నేను వివరాలు తెప్పించి అవసరమైతే కేంద్ర మంత్రివర్యులు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా తో మాట్లాడి మి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు .

మన సమస్యను తీర్చడానికి ఢిల్లీ దాకా తీసుకెళ్లి అనునిత్యం పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కు నడిగడ్డ తాండప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, సీనియర్ నాయకులు ఇస్లావత్ దశరత్ నాయక్ ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి.మాట్లాడుతూ రెండు బస్తిల సమస్య సమగ్రము గా తెలుపుతూ,మా సమస్యను పరిష్కారం చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

Ramesh

Recent Posts

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…

2 days ago

16 నుండి పటాన్‌చెరు వేదికగా ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు

ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…

2 days ago

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…

2 days ago

గీతంలో విజయవంతంగా ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…

2 days ago

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…

3 days ago

నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…

3 days ago