Telangana

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా ముకుందాపురం విద్యార్థులు ముందుంటారని తెలిపారు. తాను 1997లో శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యానని గుర్తు చేశారు. అప్పట్లో క్రీడల్లో ముకుందాపురంకు గుర్తింపు తెచ్చానని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన వినోద్ వంగల ధనుష్ కూడా మారథాన్ లో దేశ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ఏడాది సీఎం కప్ 2023లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు బాలికలు వరంగల్ జిల్లాపై గెలిచి ప్రథమ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు.

నల్గొండ జిల్లా వాలీబాల్ టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం వాసులు కావడం సంతోషంగా ఉందన్నారు. రాంకావ్య, ఎస్‌కే నాగురా,రామ్ రమ్య, ఎస్‌కె ఫారినా ,టి రేణుకలు ముకుందాపురం గ్రామస్థులు కాగా మరో విదార్థి కె లావణ్య ముకుందాపురం జిల్లాపరిషత్ పాఠశాలలో చదివడం అభినందనీయమన్నారు .సీఎం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించడం పట్ల పటాన్చెరువు సీఐ వేణుగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.నల్గొండ జట్టులోని క్రీడాకారినుల్లో ఐదుగురు తన స్వంత గ్రామం ముకుందపురం వారు కావడం గర్వంగా ఉందన్నారు . ఈ సందర్బంగా అయన క్రీడాకారులకు పదివేల నగదు ప్రొత్సహంతో పాటు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago