Telangana

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన _ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

* పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును సాదరంగా ఆహ్వానించి, వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్ శ్రీనివాస్, కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ లావణ్య, తనయుడు సాయి, చాపల విశ్వనాథం, గుమ్మడిదల జగన్ తదితరులు పాల్గొన్నారు .

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago