మన వార్తలు , హైదరాబాద్
లాక్డౌన్ కారణంగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. దీంతో మూడ్రోజులకోసారి డయాలసిస్ తప్పనిసరైంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు దొరికిన చోటల్లా అప్పులు చేశారు.
అయితే చివరగా చేసిన డయాలసిస్ చేసే సమయంలో అతని ఆరోగ్యం మరింత విషమించింది. కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో తమకెవరైనా సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
ఈ విషయాన్ని ఒక నెటిజన్ గమనించి, తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. సర్ ఈ పిల్లాడికి ఏమైనా సాయం చేయండి అని వేడుకున్నాడు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ సమస్యను తాము చూసుకుంటామని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రి వర్గాలతో కలిసి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…