Telangana

డబుల్ బెడ్ రూం ఇళ్ళు చాలా వరకు శిధిలావస్థకు చేరుకున్నాయి : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. నాణ్యత లోపంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు పూర్తి కాకుండానే మరుగునపడ్డాయని పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. పటాన్ చెరు పరిధిలోని చిట్కూల్ గ్రామంలోె డబుల్ బెడ్ రూం ఇండ్లను గడీల శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు . అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పాలన పూర్తయిన పార్టీ నిర్లక్ష్యం కారణంగా డబుల్ బెడ్ రూంలు కట్టిన వాటిని లబ్దిదారులకు కేటాయించలేదని పర్యవేక్షణలోపం కారణంగా శిధిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు .

సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గానికి వచ్చి ప్రగల్బాలు పలుకుతూ తూతూ మంత్రంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభించారని …పెండింగ్ లో ఉన్న వాటి గురించి మాట్లాడలేదన్నారు . ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యే ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవాచేశఆరు . బీసీ బంధు ,మైనార్టీ బంధు ,దళిత బంధు పేరుతో అంటూ అబద్దపు ప్రచారాలు మానుకుని డబుల్ బెడ్ రూంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మేలుకొని నియోజకవర్గ స్థాయిలో ఉన్న పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు . పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున పోరాడి ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్ , జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ,భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ , పటాన్ చేరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు , జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, జిల్లా కిసాన్ మొర్చా నాయకుడు వీరారెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డి,మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జోగు ధన్ రాజ్,బిజేవైయం పటాన్ చెరు అసెంబ్లీ కన్వీనర్ రాజ్ గోపాల్ యాదవ్, యస్.ఆర్.కే‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

10 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

10 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

10 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

10 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

10 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago