Telangana

పెన్నార్ కార్మిక లోకానికి సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శనివారం జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బి ఆర్ టి యు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి మిఠాయిలు తినిపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత మూడు పర్యాయాలుగా బి ఆర్ టి యు నాయకత్వాన్ని బలపరిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పెన్నార్ పరిశ్రమ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కార్మిక నాయకులకు సూచించారు. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కార్మికుల భవిష్యత్తుకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ పరిశ్రమ అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ, పెన్నార్ పరిశ్రమ కార్యనిర్వాహక అధ్యక్షులు యాదగిరి యాదవ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యోగా దినచర్యలో భాగం కావాలి బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా…

3 hours ago

రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50…

3 hours ago

పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ…

3 hours ago

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వందలాది మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా…

3 hours ago

సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే శాంతిభద్రతలు డీసీపీ చింతమనేని శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…

1 day ago

కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న బిస్లరీ యాజమాన్యం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…

1 day ago