శివాలయం మండప నిర్మాణానికి శంకుస్థాపన
గతంలో దేవాలయం అభివృద్ధికి 16 లక్షల రూపాయల సొంత నిధుల విరాళం
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ జీవన జ్యోతిర్లింగ శివాలయం ఆవరణలో 36 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించనున్న శివాలయం మండపం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. దేవాలయం అభివృద్ధికి గతంలో 16 లక్షల రూపాయల సొంత నిధులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తహసిల్దార్ ఆంథోనీ, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…