శివాలయం మండప నిర్మాణానికి శంకుస్థాపన
గతంలో దేవాలయం అభివృద్ధికి 16 లక్షల రూపాయల సొంత నిధుల విరాళం
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ జీవన జ్యోతిర్లింగ శివాలయం ఆవరణలో 36 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించనున్న శివాలయం మండపం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. దేవాలయం అభివృద్ధికి గతంలో 16 లక్షల రూపాయల సొంత నిధులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తహసిల్దార్ ఆంథోనీ, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…
పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…