Telangana

ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం

మనవార్తలు ,చౌటుప్పల్:

బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు గురువారం లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతి యువకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను సవివరంగా వివరించారు. ఓటు వేసే విధానాన్ని నమూనా బ్యాలెట్ ద్వారా అవగాహన కల్పించారు. స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యువత, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా ఓటు హక్కు పొందిన ప్రతి యువతి, యువకుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలి ఆయన కోరారు.

మా సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ కే..
యువత ఏకగ్రీవ తీర్మానం

నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా అందిస్తామని వారు తెలిపారు

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

8 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

10 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago