Telangana

ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం

మనవార్తలు ,చౌటుప్పల్:

బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు గురువారం లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతి యువకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను సవివరంగా వివరించారు. ఓటు వేసే విధానాన్ని నమూనా బ్యాలెట్ ద్వారా అవగాహన కల్పించారు. స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యువత, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా ఓటు హక్కు పొందిన ప్రతి యువతి, యువకుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలి ఆయన కోరారు.

మా సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ కే..
యువత ఏకగ్రీవ తీర్మానం

నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా అందిస్తామని వారు తెలిపారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago