Telangana

పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_సొంత నిధులతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ..

_విద్యార్థులకు తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలి..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులను కోరారు.విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, తల్లిదండ్రులు సైతం పూర్తిస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 4150 మంది విద్యార్థినీ విద్యార్థులకు సొంత నిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ పరీక్ష సామాగ్రి అందజేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల సందర్భంగా సొంత నిధులతో ఉదయం, సాయంత్రం స్నాక్స్ ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్య వరకు టీవీలు, ఫోన్లు, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి విద్యార్థి పూర్తిస్థాయి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు నరసింహ, తేజ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago