_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తక్షణమే తాహెర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనల మేరకు స్వయంగా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మూడు లక్షల రూపాయల వ్యయంతో శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. గురువారం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు.నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని తాహెర్ తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…