_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తక్షణమే తాహెర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనల మేరకు స్వయంగా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మూడు లక్షల రూపాయల వ్యయంతో శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. గురువారం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు.నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని తాహెర్ తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…