అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులకు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయ పరిధిలో గొంగడిని కప్పి సన్మానించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ కుర్మ నర్సమ్మ, మాజీ ఎంపీటీసీ పట్నం రాజు, సీనియర్ నాయకులు నగేష్, తులసి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…