Telangana

ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరేస్తున్నాం ఎమ్మెల్యే జిఎంఆర్

కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి

కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగురవేసి కేసిఆర్ గారికి గిఫ్టుగా అందిస్తామని పటాన్‌చెరుశాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ నుండి బరిలో దిగిన కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు లో కౌన్సిలర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు నిర్దేశించిన సమయంలో గా హాల్ లోకి వెళ్లాలని సూచించారు. కౌంటింగ్ జరిగే సమయంలో ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని ఏదైనా సందేహం అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని తెలిపారు.

గెలుపు ధ్రువీకరణ పత్రం అందించే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు చేరుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలో లోను కాకూడదని అధిష్టాన నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి మున్సిపల్ పరిధిలోని సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. బూటకపు హామీలు. మోసపూరిత ప్రకటనలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో పాటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి సంక్షేమాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.

ప్రజలు తిరిగి కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఇందుకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ మాణిక్యం, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్ యాదవ్, సపాన దేవ్, సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి. కుమార్ గౌడ్. వెంకటేష్, అంజయ్య యాదవ్, దేవానందం, తుమ్మల పాండురంగ రెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, సుధాకర్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, నరసింహ గౌడ్, పృథ్వీరాజ్, లియకత్, హమీద్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago