పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో పురాతన ఆలయాలను సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, ఎట్టయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…