పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో పురాతన ఆలయాలను సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, ఎట్టయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…