పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో పురాతన ఆలయాలను సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, ఎట్టయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…