పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో పురాతన ఆలయాలను సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, ఎట్టయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…