పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, గాయత్రి పాండు, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపిటిసి రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…