_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి
_సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
మనవార్తలు ,పటాన్ చెరు;
రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఉస్మానగర్, వెలిమెల, సందు గూడెం, పాశమైలారం పరిధిలోని టీఎస్ఐఐసి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…