పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మూడు డివిజన్ల పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుందని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు అనుగుణంగా సత్వరమే నిధులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…