పటాన్చెరు
వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం రూపొందించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు పర్యటిస్తారని, రైతులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…