పటాన్చెరు
వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం రూపొందించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు పర్యటిస్తారని, రైతులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…