పటాన్చెరు,,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గా, హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా, చోటా మసీద్ ప్రాంగణాల్లో 4 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం స్థానిక నాయకులు, మైనార్టీ మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, వీటి ద్వారా అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు నేరాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లాలూ నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, వాజిద్ అలీ, అజ్మత్, ఇక్బాల్, మోయిన్, అతీక్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…