మనవార్తలు ,పటాన్ చెరు:
ఇటీవల పటాన్ చెరు పట్టణం నుండి లడక్ వరకు 2600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైన సాహస యాత్ర ద్వారా చేరుకున్న పటాన్ చెరు పట్టణానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పూలమాలలతో సత్కరించారు.యాత్ర విశేషాలను, యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలను వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు.
నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి సాహస యాత్ర నిర్వహించడం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.భవిష్యత్తులో వెంకటేష్ చేసే సాహస యాత్రలకు, అతని చదువుకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, సోమ శీనయ్య, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…