Hyderabad

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు గా స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కృషి ఫలించింది.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలపడం పట్ల శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో 270 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం నియోజకవర్గ చరిత్రలోనే సంచలనం నిర్ణయమని అన్నారు.

పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు, శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్య విభాగం అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుపై నిరంతరం తమ కథనాలతో ప్రజలకు సమాచారం అందించిన మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago