పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాదులోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారులు గూడెం సందీప్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డిలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షీ, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…