_ఇక్రిశాట్ తరఫున పటాన్ చెరు క్రికెట్ జట్టును ఆడించాలని వినతి
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇక్రిసాట్ క్రికెట్ టీం తరపున పటాన్ చెరుక్రికెట్ టీం జట్టు అవకాశం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇక్రిశాట్ అధికారులను కోరారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్ కుమార్ తో ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఇక్రిశాట్ క్రికెట్ జట్టు గత 10 సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొనడం లేదని, ఈ అవకాశాన్ని పటాన్ చెరుక్రికెట్ జట్టుకు కల్పించాలని ఆయన కోరారు. పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను ఇక్రిసాట్ జట్టు తరఫున పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఇక్రిశాట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…