_ఇక్రిశాట్ తరఫున పటాన్ చెరు క్రికెట్ జట్టును ఆడించాలని వినతి
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇక్రిసాట్ క్రికెట్ టీం తరపున పటాన్ చెరుక్రికెట్ టీం జట్టు అవకాశం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇక్రిశాట్ అధికారులను కోరారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్ కుమార్ తో ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఇక్రిశాట్ క్రికెట్ జట్టు గత 10 సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొనడం లేదని, ఈ అవకాశాన్ని పటాన్ చెరుక్రికెట్ జట్టుకు కల్పించాలని ఆయన కోరారు. పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను ఇక్రిసాట్ జట్టు తరఫున పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఇక్రిశాట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…