ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ మేరకు ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని వడ్డించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలికి, సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉపేంద్ర బాబు, టీడీపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…