Hyderabad

కాలుష్య నియంత్రణ అధికారులు పై ఎమ్మెల్యే ఆగ్రహం…

రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు

పటాన్ చెరు:

అభివృద్ధి పనుల విషయంలో పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి వ్యవస్థను ఏర్పాటు చేసిన, నియోజకవర్గంలో ఇప్పటికీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో నాలుగు వేల పైచిలుకు భూ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

పటాన్ చెరు మండల పరిధిలో అపరిచిత భూ సమస్యల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో రేపటిలోగా అందించాలని ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సున్నితంగా మందలించారు.

ఇటీవల రుద్రారం, లకడారం గ్రమే చెరువులలో కాలుష్యం మూలంగా చేపలు చనిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బాత్రూం, మరుగుదొడ్లు ప్రారంభించారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి, ఎంపీడీవో బాన్సిలాల్, ఎమ్మార్వో మైపాల్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago