Hyderabad

కాలుష్య నియంత్రణ అధికారులు పై ఎమ్మెల్యే ఆగ్రహం…

రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు

పటాన్ చెరు:

అభివృద్ధి పనుల విషయంలో పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి వ్యవస్థను ఏర్పాటు చేసిన, నియోజకవర్గంలో ఇప్పటికీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో నాలుగు వేల పైచిలుకు భూ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

పటాన్ చెరు మండల పరిధిలో అపరిచిత భూ సమస్యల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో రేపటిలోగా అందించాలని ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సున్నితంగా మందలించారు.

ఇటీవల రుద్రారం, లకడారం గ్రమే చెరువులలో కాలుష్యం మూలంగా చేపలు చనిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బాత్రూం, మరుగుదొడ్లు ప్రారంభించారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి, ఎంపీడీవో బాన్సిలాల్, ఎమ్మార్వో మైపాల్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

6 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

9 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago