Hyderabad

కాలుష్య నియంత్రణ అధికారులు పై ఎమ్మెల్యే ఆగ్రహం…

రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు

పటాన్ చెరు:

అభివృద్ధి పనుల విషయంలో పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి వ్యవస్థను ఏర్పాటు చేసిన, నియోజకవర్గంలో ఇప్పటికీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో నాలుగు వేల పైచిలుకు భూ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

పటాన్ చెరు మండల పరిధిలో అపరిచిత భూ సమస్యల వివరాలను సమగ్ర నివేదిక రూపంలో రేపటిలోగా అందించాలని ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సున్నితంగా మందలించారు.

ఇటీవల రుద్రారం, లకడారం గ్రమే చెరువులలో కాలుష్యం మూలంగా చేపలు చనిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకుని రాగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన బాత్రూం, మరుగుదొడ్లు ప్రారంభించారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి, ఎంపీడీవో బాన్సిలాల్, ఎమ్మార్వో మైపాల్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago