_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, హరితహారం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి యువతకు ఆశా కిరణంగా నిలిచిన మహోన్నత నాయకుడు మంత్రి కేటీఆర్ అని ప్రశంసించారు. తన జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాలకు దూరంగా నిర్వహించాలన్న మంత్రి సూచన మేరకు.. అమీన్పూర్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, హెచ్డిసి కమిటీ మెంబర్ శ్రీను, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
_అనాధ ఆశ్రమం లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..
_మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటన..
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.తన పుట్టినరోజును హంగు ఆర్భాటాలకు దూరంగా నిరుపేదల సంక్షేమానికి అండగా నిలుస్తూ నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మహిమా మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనాధ పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తల్లిదండ్రులను కోల్పోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాధ పిల్లలను చేరదీసి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.ఆశ్రమంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో భోజనం, యూనిఫామ్, ఉన్నత విద్యను అందించనున్నట్లు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…
పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…