Telangana

మైత్రిలో ముస్తాబవుతున్న మినీ కైలాసం..

_50 అడుగుల భారీ శివలింగం.. 15 అడుగుల ధ్యానముద్ర శివుడు..

_వేద బ్రాహ్మణులచే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం

_సినీ కళాకారులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి మహా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారుగురువారం మహా జాగరణ నిర్వహించబోతున్న పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రజలందరూ సామూహికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ ఆ పరమ శివుడిని ధ్యానిస్తూ జాగరణ నిర్వహించాలన్న తలంపుతో మహా జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సాక్షాత్తు పరమశివుడి నివాసమైన కైలాసగిరిని మరిపించేలా పర్వతాలు, 50 అడుగుల శివలింగం, 15 అడుగుల ధ్యానముద్ర శివుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం 6 గంటల నుండి వేద బ్రాహ్మణులచే మహన్యాస అభిషేకం, పల్లకి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, ఎస్పీ చరణ్, సునీత, సుమంగళి, గద్దర్ నరసింహ, మౌనిక యాదవులతోపాటు ప్రముఖ తెలుగు వ్యాఖ్యాత సుమ కనకాల, తెలంగాణ యాస, భాషకు ప్రతిరూపమైన బిత్తిరి సత్తి, తదితర కళాకారులచే సంగీత విభావరి, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తుల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ సదుపాయం, మంచినీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల వాహనాల కోసం సాకి చెరువు కట్ట, ప్రభుత్వ ఆసుపత్రి, బ్లాక్ ఆఫీస్, రహదారి బంగ్లా తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.భక్తులందరూ సకాలంలో కార్యక్రమానికి హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

1 day ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

2 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

2 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

3 days ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

3 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

3 days ago