Telangana

మెరుగైన జీవనం కోసం వలస : కతార్ ప్రొఫెసర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మెరుగెన జీవనం కోసం ప్రజలు వలస వెళుతుంటారని , దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నట్టు ఉంటారని ఖతార్లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ విదేశీయులు , సంచార వలసదారులు : భారతదేశంలో మానవ చలనశీలత యొక్క సామాజికశాస్త్రం ‘ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాలకు , గ్రామాల నుంచి పట్టణాలకు , ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వంటి మూడు రకాల మానవ చలనశీలతలు ఉన్నట్టు ఆయన చెప్పారు . మెజారిటీ వలసదారులు భారతదేశం అంతటా సంపన్న పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని , అందులో అత్యధిక శాతం మంది అనధికారిక ఆర్థిక వ్యవస్థలో , అనిశ్చిత పరిస్థితులలో , తక్కువ ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .

మానవ చలనశీలత చారిత్రక నేపథ్యాలను ఆయన వివరిస్తూ , కాలానుగుణంగా , వాతావరణ మార్పులను బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలస వెళుతుంటారన్నారు . కొండ ప్రాంత ప్రజలు అననుకూల వాతావరణ పరిస్థితులలో మెదైన ప్రాంతానికి వస్తుంటారని , అలాగే స్థానికంగా ఉపాధి లభించనప్పుడు పట్టణ ప్రాంతాలకు వెళతారని , మళ్లీ స్థానికంగా పని లభించేటప్పుడు వారంతా తిరిగొస్తారని చెప్పారు . వలసల ఆర్థిక సిద్ధాంతాలు మానవ చలనశీలత యొక్క సామాజిక సాంస్కృతి తర్కాన్ని పట్టుకోలేవని ఆయన స్పష్టీకరించారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago