Telangana

మెరుగైన జీవనం కోసం వలస : కతార్ ప్రొఫెసర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మెరుగెన జీవనం కోసం ప్రజలు వలస వెళుతుంటారని , దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నట్టు ఉంటారని ఖతార్లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ విదేశీయులు , సంచార వలసదారులు : భారతదేశంలో మానవ చలనశీలత యొక్క సామాజికశాస్త్రం ‘ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాలకు , గ్రామాల నుంచి పట్టణాలకు , ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వంటి మూడు రకాల మానవ చలనశీలతలు ఉన్నట్టు ఆయన చెప్పారు . మెజారిటీ వలసదారులు భారతదేశం అంతటా సంపన్న పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని , అందులో అత్యధిక శాతం మంది అనధికారిక ఆర్థిక వ్యవస్థలో , అనిశ్చిత పరిస్థితులలో , తక్కువ ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .

మానవ చలనశీలత చారిత్రక నేపథ్యాలను ఆయన వివరిస్తూ , కాలానుగుణంగా , వాతావరణ మార్పులను బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలస వెళుతుంటారన్నారు . కొండ ప్రాంత ప్రజలు అననుకూల వాతావరణ పరిస్థితులలో మెదైన ప్రాంతానికి వస్తుంటారని , అలాగే స్థానికంగా ఉపాధి లభించనప్పుడు పట్టణ ప్రాంతాలకు వెళతారని , మళ్లీ స్థానికంగా పని లభించేటప్పుడు వారంతా తిరిగొస్తారని చెప్పారు . వలసల ఆర్థిక సిద్ధాంతాలు మానవ చలనశీలత యొక్క సామాజిక సాంస్కృతి తర్కాన్ని పట్టుకోలేవని ఆయన స్పష్టీకరించారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago