Districts

గీతంలో మైక్రోకంట్రోలర్ పుస్తకావిష్కరణ

మనవార్తలు,పటాన్‌చెరు:

విద్యావేత్త, ఎన్ఐటీ వరంగల్ పూర్వ అధ్యాపకుడు ప్రొఫెసర్ పువ్వాడ రమేష్ రచించిన మైక్రోకంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే పుస్తకాన్ని శుక్రవారం గీతం కెరీర్ గైడైన్స్ సెల్ కాన్ఫరెన్స్ హాల్లో గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఆవిష్కరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాధిపతులు ప్రొఫెసర్ టీ.మాధని, ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ వైద్యంలో సమకాలీన అనువర్తనానికి సంబంధించిన అంశాలపై ప్రొఫెసర్ రమేష్ ఆలోచనల సంకలనమే ఈ పుస్తకం అన్నారు. కాగా రచయిత వరంగర్ ఎన్ఐటీలో పనిచేసిన ప్రొఫెసర్ పువ్వాడ రమేష్, ఆ తరువాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో సేవలందించారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బోధన, పరిశోధనలో దాదాపు 40 ఏళ్ళకు పైగా అనుభవం ఆయన సొంతం, బయో మెడికల్ ఇంజనీరింగ్ పరిశోధనలో ప్రొఫెసర్ రమేష్ కు అపారమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ జర్నల్స్, సదస్సులో ఆయన దాదాపు వందకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. విద్య, పరిశోధన రంగాలలో ఆయనకున్న అనుభవాన్ని పంచుకునేందుకు గాను వివిధ దేశాలను ఆయన సందర్శించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago