Districts

సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు పొడ‌గించాల‌ని తీర్మాణించిన మెట్రోరైల్ సాధ‌న స‌మితి

_వేగంగా అభివృద్ది చెందుతున్న ప‌టాన్ చెరు మీదుగా సంగారెడ్డికి మెట్రో రైలు పొడ‌గించాలి

మనవార్తలు ,పటాన్ చెరు:

హైద‌రాబాద్ మెట్రోరైలును సంగారెడ్డి వ‌ర‌కు పొడ‌గించాలని మెట్రోరైలు సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ,మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులోని ముదిరాజ్ భ‌వ‌న్ లో మెట్రో రైలు సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో చ‌ర్చావేదిక నిర్వ‌హించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో రాజకీయాల‌కు అతీతంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ,కార్మికులు ,కర్షకులు, ఉద్యోగులు, విద్యావేత్తలు ,ప్రొఫెసర్లు ,పారిశ్రామికవేత్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు .మెట్రో రైలును మియాపూర్ నుండి ప‌టాన్ చెరు మీదుగా సంగారెడ్డి వ‌ర‌కు విస్తరించాల్సిన అవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని మాజీ ఎమ్మెల్యే సత్య‌నారాయ‌ణ అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్ర‌భుత్వాలు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో మెట్రోరైల్ , ఫ్లై ఓవ‌ర్ నిర్మించాల‌నే ప్ర‌తిపాద‌న ఉంద‌న్నారు.ప‌టాన్ చెరు ప్రాంతంలో ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో క‌మ్ ఫ్లై ఓవ‌ర్ ను ప‌టాన్ చెరువు వ‌ర‌కు నిర్మించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ఇదే విష‌యంపై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ లేఖ రాస్తామ‌ని పేర్కొన్నారు.

మెట్రోరైలు సాధ‌న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు.ఈ ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేలా విధి విధానాలు రూపొందించి అతి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు .ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని మ‌రింత ఉధృతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో జనభా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రో రైలు వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి మెట్రో రైలు  పొడిగించేంత వరకు తమ పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన  తెలిపారు. చ‌ర్చ వేదిక నిర్వ‌హించిన మెట్రో రైలు సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు , మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ‌ను స్థానికులు ఘ‌నంగా స‌న్మానించారు .

ఈ చ‌ర్చా వేదిక అనంత‌రం మెట్రోరైలును సంగారెడ్డి వ‌ర‌కు విస్త‌రించాల‌ని తీర్మాణించారు. ఈ కార్య‌క్ర‌మంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టు శ్రీధర్, ప్రముఖులు శంకర్ రావు ,పాశమైలారం ఐలా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పారిశ్రామికవేత్త గోకుల్ శ్రీధర్ ,గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ శివ నాగేంద్ర, హన్మంత్ రెడ్డి  ,గిరి, ఇక్బాల్, రాజ్ కుమార్ ,  నరసింహారెడ్డి ,సరస్వతి ,జంగమ్మ నియోజకవర్గ పరిధిలోని వివిధ కంపెనీల కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago