Telangana

మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలి _మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు పొడగించారని , ఆర్ సి పురం వరకు మాత్రమే పొడిగింపు పరిమితం చేయొద్దని ,పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ వరకు రెండో దశలోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో లైన్ ఇస్నాపూర్ వరకు కచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సత్తన్న తెలిపారు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని అయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో మెట్రో లైన్ మార్గాన్ని కుదించవద్దని కోరారు. నిత్యం వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు తగ్గుతాయని సత్తన్న తెలిపారు అదే విధంగా ఓఅర్ఆర్ శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రెండో దశలో మియాపూర్ – ఇస్నాపూర్ మార్గ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఇదే అంశం పై త్వరలో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ ఈర్ల రాజు మెట్టుశ్రీధర్ చవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago