Districts

మెట్రోరైలు ను సంగారెడ్డి వరకు పొడగించాలి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ

_మెట్రో రైల్ సాధించేవరకు పోరాడతాం

మనవార్తలు,పటాన్‌చెరు:

గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలును పొడగించాలని ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మియాపూర్ ,లింగంపల్లి ,పటాన్ చెరు ,సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువచ్చేందుకు సంగారెడ్డి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు ‌హైదరాభాద్ మెట్రో రైలు సాధన ఉద్యమం కొనసాగుతుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ వెల్లడించారు.

పటాన్ చెరు పట్టణంలో ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ మియపూర్ నుండి పటాన్ చెరు సంగారెడ్డి వరకు మెట్రో రైల్ సాధన కోసం మరో ఉద్యమానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ తెరలేపారు. మెట్రో రైల్ సాధన ఉద్యమంలో భాగంగా ఆదివారం పెద్దయెత్తున ఆయన అనుచరులు, కార్యకర్తలు,ఉద్యమకారులతో జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చి పటాన్ చెరు చౌరస్తా వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మెట్రో రైల్ సాధన కోసం ఉద్యమం చేస్తామని ప్రకటించారు.ఇది ప్రజలకోసమే కాని తన రాజకీయ కోసం కాదని ఈ ఉద్యమం కోసం అన్ని పార్టీల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు.మెట్రో రైల్ సాధించేవరకు ఈ ఉద్యమం అగదని ఇది కేవలం, ఈ ప్రాంతప్రజల ఎజండాగా ముందుకుసాగుతుందని  త్వరలోనే విది విధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం పటాన్ చెరులో హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

7 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

7 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

7 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

7 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago