కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎం.పి.రఘునందన్ రావు లకు వినతిపత్రం అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రోరైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ కే. సత్యనారాయణ మరియు సభ్యుల అధ్వర్యంలో కేంద్రబొగ్గుగనుల శాఖా మంత్రివర్యులు కిషన్ రెడ్డి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు లకు వినతిపత్రం అందించారు . గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలని ప్రతిపాదించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.వో లో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందని , సంగారెడ్డి జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ పూర్ వరకు మెట్రో ను పొడగించాల్సిందే అని మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేయడం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేవిధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి వర్యులను కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘురందన్ రావు ని కోరారు , వారు సానుకూలంగా స్పందించినట్టు మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు తెలిపారు .ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ , అబ్దుల్ బాసిత్, ఈర్ల రాజు ముదిరాజ్, మెట్టు శ్రీధర్, పన్యాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…