Telangana

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో

జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఒక దేశం యొక్క నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ నిలుస్తోందని జాతీయ భౌతిక ప్రయోగశాల (CSIR–NPL) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ చెప్పారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘క్వాంటం టెక్నాలజీలకు క్వాంటం మెట్రాలజీ, మెట్రాలజీ’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. విస్తరిస్తున్న క్వాంటం టెక్నాలజీల అభివృద్ధిలో ఖచ్చితత్వ కొలత యొక్క కీలక పాత్ర, ఈ సాంకేతికతల భవిష్యత్తులో అందివచ్చే విస్తారమైన ఉపాధి అవకాశాలను డాక్టర్ వేణుగోపాల్ వివరించారు. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని ఆయన స్పష్టీకరించారు.

జాతీయ భౌతిక ప్రయోగశాల, దాని జాతీయ బాధ్యతలు, క్షిపణుల నుంచి అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాల వరకు ఈ సంస్థ సహకారంపై సమగ్ర అవలోకనాన్ని అందించారు. అకౌస్టిక్ గ్యాస్ థర్మోమెట్రీ, సీఎస్-ఫౌంటెన్ అటామిక్ క్లాక్, భారత ప్రామాణిక సమయం (ఐఎస్ టీ) యొక్క నిరంతర నిర్వహణతో సహా ఎన్ పీఎల్ లోని అత్యాధునిక సౌకర్యాలను కూడా ఆయన వివరించారు.
జాతీయ మెట్రాలజీ సంస్థల ప్రపంచ నెట్ వర్కు గురించి చెబుతూ, శాస్త్రీయ, సాంకేతిక పురోగతికి గుర్తించదగిన, అధిక ఖచ్చితత్వ కొలతలు అవసరమని చెప్పారు. భవిష్యత్తు మెట్రోలజీ వినియోగంలో నానోఫోటోనిక్స్ యొక్క ప్రాముఖ్యత, వీటి మూలాలు, వాటిని కనిపెట్టే పరికరాల కోసం సింగిల్-ఫోటాన్ మెట్రాలజీ, లేబుల్-ఫ్రీ సింగిల్-మాలిక్యూల్ డిటెక్షన్, ఇంటిగ్రేటెడ్ క్వాంటం సర్క్యూట్ల కోసం SiN & LNOI ప్లాట్ ఫారమ్ ల సామర్థ్యాన్ని పెంచడం అవశ్యమని ఆయన పేర్కొన్నారు.

తొలుత, గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీ.వీ.ఆర్. టాటా వక్తను పరిచయం చేయగా, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం తదితరులు అతిథిని సత్కరించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరై, సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

12 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago

కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి_ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్…

3 days ago