మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మండలంలో మిగిలిన. జానకంపేట, వడక్ పల్లి గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో చేర్చాలని. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ను. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎం ఏ యు డి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామపంచాయతీలలో ఆరు గ్రామపంచాయతీలను ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. రెండు గ్రామాలు విలీనం కాకపోవడంతో పరిపాలనాపరంగా అభివృద్ధి కోణంలో తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. మిగిలిన రెండు గ్రామాల అంశంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…