Telangana

గీతంలో కంటెంట్ రైటింగ్ వర్క్ షాప్ ప్రారంభం

నాలుగు రోజుల పాటు కొనసాగనున్న కార్యశాల

నైపుణ్యాలను పెంపొందించనున్న పరిశ్రమ నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కంటెంట్ సృష్టి, కమ్యూనికేషన్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా నాలుగు రోజుల ‘కంటెంట్ రైటింగ్ వర్క్ షాప్’ను గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) మంగళవారం ప్రారంభించారు. మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిలో జీవితకాల పెట్టుబడిగా రూపొందించారు.ఈ వర్క్ షాప్ ను జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ లాంఛనంగా ప్రారంభించి, సాంకేతికత పరిజ్జానం యొక్క మార్పుకు అనుగుణంగా, ముఖ్యంగా కంటెంట్ రైటింగ్ వృత్తిపై కృత్రిమ మేధస్సు ప్రభావాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యశాల ప్రాంగణ నియామకాలకు సిద్ధం కావడం గురించి మాత్రమే కాదని, కాలానుగుణంగా అభివృద్ధి చెందడం గురించన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

కెరీర్ గైడెన్స్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మమతా రెడ్డి మాట్లాడుతూ, కొత్త సాంకేతికతలను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఒక ప్రత్యేక ఆలోచనా విధానాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం’ అని ఆమె హితబోధ చేశారు. ఈ కార్యశాల నిరంతర అభ్యాస సంస్కృతిని పెంపొందించడంలో నిర్వాహకుల దూరదృష్టికి నిదర్శనంగా ఆమె అభివర్ణించారు.మొదటి సెషన్ రిసోర్స్ పర్సన్ గా జియో మారియా పాల్గొని, కంటెంట్ రైటింగ్ ప్రాథమిక అంశాలు, కంటెంట్ రకాల, ఎస్ఈవో టెక్నిక్ వంటి కీలక అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. తరువాతి రెండు సెషన్లలో కంటెంట్ కమ్యూనికేషన్, వ్యక్తిగత బ్రాండింగ్ వంటి వాటిని వివరించారు.

మరో మూడు రోజులు కొనసాగే ఈ కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు పాల్గొని ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్, మీడియా స్టడీస్ విభాగాధిపతి ఎస్ ఆర్ సంజీవ్ కుమార్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కంటెంట్ రైటింగ్ పరిశ్రమ యొక్క సవాళ్లు, అవకాశాలకు సిద్ధం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొంటున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago