Telangana

జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని మెగా హెల్త్ చెకప్ క్యాంప్

_యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి

– ఫ్యాక్టరీస్ ఆప్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు

– సద్వినియోగం చేసుకున్న ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు పేర్కొన్నారు.జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం బీరంగూడ లోని షిరిడి సాయి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ మెగా హెల్త్ చెకప్ క్యాంప్ లో ఎంఎస్ఎన్ పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా క్యాంపుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గోపాలరావు మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే తమ దినచర్య అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. బయట తినే ఆహారం హైజెనిక్ గా ఉండదని, ఇంట్లో వండిన మంచి ఆహారాన్ని భుజించే అలవాటు పెద్దలు అలవాటు చేసుకోవడంతో పాటు తమ పిల్లలకు నేర్పాలన్నారు. ఎపిఐ తయారీ హెడ్ ఎన్ఎన్ వి సుబ్బారావు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ హెచ్ఆర్ హెడ్ పద్మనాభన్, కెఎల్ఎన్ మూర్తి, డాక్టర్ వంశీ కృష్ణన్, డాక్టర్లు, ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago