Categories: politics

సామాజిక బాధ్యతను చాటిచెప్పిన ఎంబీఏ విద్యార్థులు

కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమ చిన్నారులతో ఉత్సాహభరితంగా ‘జాయ్ ఆఫ్ గివింగ్’

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యాపార మేళకువలే కాదు, సామాజిక బాధ్యత కూడా తమ మీద ఉందన్న స్ఫూర్తిని చాటేలా గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ ఎంబీఏ విద్యార్థులు గురువారం ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలో ఉన్న ఆనందం) కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, గాజులరామారంలోని కేర్ ఎన్ లవ్ అనాథాశ్రమానికి చెందిన 44 మంది చిన్నారులు, ఇద్దరు సిబ్బందిని గీతంకు ఆహ్వానించి, రోజంతా వారితో ఆడి పాడుతూ, తమలోని సామాజిక స్పృహ, కరుణలను హృదయపూర్వకంగా ప్రదర్శించారు.అనాథ శరణాలయం వార్డెన్ స్వర్ణలత ఆధ్వర్యంలో చిన్నారులు చిరునవ్వులు చిందించేలా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిన్నారులందరికీ ఎంబీఏ విద్యార్థులు అందమైన బహుమతులను అందించి, తమలో మూర్తీభవించిన దాతృత్వం, దయ స్ఫూర్తిని చాటిచెప్పారు. సామాజిక శ్రేయస్సుకు దోహదపడేలా, ఇందులో పాల్గొన్న వారందరిలో ఆశ, సానుకూల భావాన్ని కలిగించారు.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీ-స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా తదితరులు పాల్గొని, ఆహూతులందరిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పూజ ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనకు చిన్నారుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఉద్దేశించిన సృజనాత్మకత, ఆనందానికి ఆమె ప్రదర్శన ఉదాహరణగా నిలిచింది. బీ-స్కూల్ అధ్యాపకులు డాక్టర్ నాగప్రియ, డాక్టర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago