– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ
మనవార్తలు,పటాన్ చెరు:
పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు . కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని , మరీ ముఖ్యంగా ఆంగ్లం , గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు . ఆ లోటును కొంతవరకైనా పూడ్చే లక్ష్యంతో గీతం సెన్స్డ్ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నెపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు .
తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని , తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల శ్రీపాల్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు . అతనితో పాటు ఎ.సూర్యవంశీ , డి.అక్షయ్ , బి . ధనుష్యరెడ్డి , కె . జాహ్నవి , వి . అభిజిత్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు . పాఠశాల హెడ్మాస్టర్ , ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి , తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…