Districts

ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ

మనవార్తలు,పటాన్ చెరు:

పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు . కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని , మరీ ముఖ్యంగా ఆంగ్లం , గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు . ఆ లోటును కొంతవరకైనా పూడ్చే లక్ష్యంతో గీతం సెన్స్డ్ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నెపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు .

తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని , తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల శ్రీపాల్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు . అతనితో పాటు ఎ.సూర్యవంశీ , డి.అక్షయ్ , బి . ధనుష్యరెడ్డి , కె . జాహ్నవి , వి . అభిజిత్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు . పాఠశాల హెడ్మాస్టర్ , ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి , తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago