Telangana

అట్టహాసంగా ముగిసిన మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ

_క్రీడలకు కేంద్రం మైత్రి మైదానం..

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_విజేతలుగా నిలిచిన రెడ్ డ్రాగన్.. రన్నర్స్ గా నిలిచిన ప్రిన్స్ ఎలెవన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ ముగింపు పోటీలు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.హోరాహోరీగా సాగిన ఫైనల్స్ లో రెడ్ డ్రాగన్ జట్టు విజేతలుగా నిలువగా, ప్రిన్స్ ఎలెవెన్ రన్నర్స్ గా నిలిచింది.విజేతలకు లక్ష ఇరవై వేల రూపాయలు నగదు బహుమతి, రన్నర్స్ కి 75 వేల రూపాయలు నగదు బహుమతి అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి స్టేడియాని ఇటీవల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆధునికరించామని గుర్తు చేశారు. పగలతో పాటు రాత్రి సమయంలో సైతం క్రీడలు నిర్వహించేలా హై మాస్ట్ విద్యుత్ లైట్ల సదుపాయాన్ని ఏర్పరిచామని తెలిపారు. సంవత్సరం పొడువునా వివిధ క్రీడా అంశాల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మైత్రి క్రికెట్ క్లబ్ తరఫున రంజీలో పాల్గొనేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో చర్చించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హాజరవుతున్న నియోజకవర్గ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నగదు బహుమతులను ఎస్ ఆర్ గ్రూప్ ఇండస్ట్రీస్ అందజేసింది.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, క్రైమ్ సీఐ బీసన్న, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రకాష్ రావు, పృథ్వి రాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago