Telangana

మహాత్మా గాంధీ పేరు యథాతథంగా కొనసాగించాలి_సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి అన్నారు.ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ 2004లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో, వారికి ఉపాధి కల్పించి ఆర్థికంగా బలపరచేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు పని దినాలు లభించి వారి జీవన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు.

అయితే ప్రస్తుత బీజేపీ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి “వికసిత్ భారత్ – జీ రామ్ జీ” పేరుతో బిల్లు తీసుకురావడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉపాధి పనులు కార్మికుల చేత చేయిస్తే, ప్రస్తుతం 90 శాతం పనులను యంత్రాల ద్వారా చేసుకునేలా చట్టంలో మార్పులు చేశారని అన్నారు. అలాగే గతంలో ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరిస్తే, ఇప్పుడు 40 శాతం భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర మౌళి, మార్గరి శ్రీనివాస్, వి.కే. రమేష్, కరుణాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేష్ ముదిరాజ్, శ్రీనివాస్, సుబ్బయ్య, మధుసూదన్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago