Telangana

మహాత్మా గాంధీ పేరు యథాతథంగా కొనసాగించాలి_సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి అన్నారు.ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ 2004లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో, వారికి ఉపాధి కల్పించి ఆర్థికంగా బలపరచేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు పని దినాలు లభించి వారి జీవన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు.

అయితే ప్రస్తుత బీజేపీ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి “వికసిత్ భారత్ – జీ రామ్ జీ” పేరుతో బిల్లు తీసుకురావడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉపాధి పనులు కార్మికుల చేత చేయిస్తే, ప్రస్తుతం 90 శాతం పనులను యంత్రాల ద్వారా చేసుకునేలా చట్టంలో మార్పులు చేశారని అన్నారు. అలాగే గతంలో ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరిస్తే, ఇప్పుడు 40 శాతం భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర మౌళి, మార్గరి శ్రీనివాస్, వి.కే. రమేష్, కరుణాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేష్ ముదిరాజ్, శ్రీనివాస్, సుబ్బయ్య, మధుసూదన్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago