Telangana

మాదాపూర్ డివిజన్ లో అత్యధిక సభ్యత్వాలు చేయిస్తాం – రాధాకృష్ణ యాదవ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గల మాదాపూర్ డివిజన్ లోని మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్కులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత నమోదు నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాధాకృష్ణ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు బిజెపి పార్టీ యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభను తన మాటల్లో వివరించారు. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా 2000 కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించగలిగే అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపి పార్టీని బలోపేతం చేసే విషయంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం రాధాకృష్ణ యాదవ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, బిజెపి స్థానిక నాయకులలో,పార్టీ శ్రేణులలో,బిజెపి కార్యకర్తలలో, ఉత్సాహాన్ని నింపే విధంగా వారితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ద్వారా కాలనీ వాసులను, స్థానికులను కలుస్తూ పలు సభ్యత్వాలు నమోదు చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ నాయకులు ప్రశoశించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిషన్ నాయకులు సూర్ణ శ్రీశైలం కురుమ, రంజిత్ కుమార్, మహేష్ రవ్వ, సత్యనారాయణ, అల్లాడి ప్రవీణ్, ముఖేష్, వంశీ, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు…

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

40 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

47 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

57 minutes ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago