Telangana

అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాడి

ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశ్నించడం ప్రజల హక్కని, అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం అని ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామీ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని మీడియా స్టడీస్, ఆంగ్లం-ఇతర భాషల విభాగాల ఆధ్వర్యంలో ‘అసమ్మతి, సంభాషణ: ప్రజాస్వామ్య సమాజంలో మానవ హక్కుల ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు.మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అసమ్మతి యొక్క కీలక పాత్రపై తన అభిప్రాయాలు, దృక్పథాలను వెల్లడించారు. ప్రస్తుత సామాజిక-రాజకీయ దృశ్యాన్ని ప్రశ్నించడం యొక్క ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. దైహిక సమస్యలతో విభేదించడానికి, విమర్శనాత్మకంగా పాల్గొనడానికి ప్రజలకు స్వేచ్చ. స్థలం ఉందా అని ఆలోచించమని ఆమె కోరారు. ప్రైవేటు యాజమాన్యంలో మీడియా ఏకీకరణ యొక్క భయంకరమైన ధోరణిని ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఇది తరచుగా అట్టడుగు స్వరాలను నిశ్శబ్దం చేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.

అసమ్మతి రచయితలు, మేధావులను ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘జాతి వ్యతిరేకులు’ అని ముద్ర వేసే సమస్యాత్మక ధోరణిని కూడా డాక్టర్ కందసామి ప్రస్తావించారు. కార్పొరేట్ అభివృద్ధి, వనరుల దోపిడీపై రాజ్యం దృష్టి సారించడాన్ని ఆమె విమర్శించారు. భిన్నాభిప్రాయాలకు సమాజం ఎలా విలువ ఇస్తుందో పునఃపరిశీలన చేయాలని పిలుపునిచ్చారు.గీతం ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ సయంతన్ మండల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం చివరన డాక్టర్ కందసామి తన పదునైన పద్యం ‘రేపు ఎవరో మిమ్మల్ని అరెస్టు చేస్తారు’ ఆమె ప్రసంగంలోని అంశాలను లోతుగా ప్రతిధ్వనింపజేసింది.సమాజంలో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడంలో ఇటువంటి చర్చల ప్రాముఖ్యత ఉందంటూ డాక్టర్ శ్రుతీష్ చేసిన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో పాల్గొన్నవారు మానవ హక్కులు, భిన్నాభిప్రాయాల ఆవశ్యకత, ప్రజా సంభాషణను రూపొందించడంలో మీడియా పాత్ర గురించి అవగాహనను పునరుద్ధరించుకున్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago