Telangana

మహనీయుల జీవితాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_సొంత నిధులతో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాల ఏర్పాటు

_ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విశ్వ గురు మహాత్మా బసవేశ్వర విగ్రహాలను ఏర్పాటుచేసి భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తిని అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సొంత నిధులతో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ కూడలి, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు వెలిమల తండాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతోపాటు బీరంగూడ చౌరస్తాలో విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెల 12న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల తండా , 13న కొల్లూరులో, 14న పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన బీరంగూడ చౌరస్తాలో విశ్వగురు మహాత్మ బసవేశ్వర విగ్రహాలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు విగ్రహావిష్కరణలకు హాజరయ్యేలా చూడాలని ప్రతినిధులకు సూచించారు. వీటితోపాటు మహాత్మా గాంధీ, చత్రపతి శివాజీ, చాకలి ఐలమ్మ ల విగ్రహాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈనెల 14న రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 120 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago